byసూర్య | Fri, Aug 05, 2022, 12:48 PM
వికారాబాద్ జిల్లా చౌడపూర్ మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం వద్ద 11 రోజులుగా వీఆర్ఏలు నిరవధిక సమ్మె చేయడం జరిగింది. గురువారం పరిగి మాజీ ఎమ్మెల్యే వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి వారికి మద్దతు తెలియజేశాడు. ఈ సందర్భంగా రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీని అమలు పరచాలని డిమాండ్ చేశాడు. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏలతో కలసి ప్రగతి భవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అశోక్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు నరసింహ నాయక్ సలీం, వెంకటయ్య గౌడ్, తదితరులు పాల్గొన్నారు.