byసూర్య | Fri, Aug 05, 2022, 12:46 PM
ఇప్పుడిప్పుడే మాస్కులు, శానిటైజర్లు పక్కనపెట్టి ఊపిరి తీర్చుకుంటున్న సమయంలో కరోనా మెల్లమెల్లగా తన ప్రభావం చూపడం మొదలయ్యింది. వివరాల్లోకి వెళ్తే మల్కాజిగిరి నియోజకవర్గం లో గల మేడ్చల్ మల్కాజిగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో 70 మందిలో గాను 11 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది అని ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది తెలియజేశారు. ఈ సందర్భంగా వైద్యులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించడం జరిగింది. కరోనా సోకిన వారిలో నలుగురు పురుషులు ఏడు మంది మహిళలు ఉన్నారు అని తెలియజేశారు.