byసూర్య | Thu, Jul 07, 2022, 10:11 AM
ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తిని వెనుక నుంచి వచ్చిన పాలవ్యాన్ బలంగా ఢీకొట్ట డంతో అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. బేగంపేట ఓల్డ్ కస్టమ్స్బస్తీకి చెందిన సురేష్ రెడ్డి (39) పానాపు నిర్వహిస్తుంటాడు. బుధవారం మధ్యాహ్నం 12. 30 గంటల ప్రాంతంలో యాక్టివా ద్విచక్ర వాహనంపై రసూల్పురా నుంచి బేగంపేట బస్తీ వైపు వెళ్తు న్నాడు. అదే సమయంలో హిమాయత్నగర్ నుంచి బేగంపేట మీదుగా మియాపూర్ వైపు వెళ్తున్న పాల వ్యాన్ పీ అండ్ టీ జంక్షన్ వద్దకు రాగానే సురేష్ రెడ్డి నడుపుతున్న ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టిం ది. దీంతో కిందపడిపోయిన సురేష్ రెడ్డి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి పోలీసులు మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.