byసూర్య | Wed, Jul 06, 2022, 10:28 PM
తెలంగాణ ఇంటర్ బోర్డు బుధవారం కీలక ప్రకటన చేసింది. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫీజు చెల్లింపు గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. నేటితో ముగియాల్సిన గడువును జూలై 8 వరకు పొడిగించారు. విద్యార్థులు, కాలేజీల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఇంటర్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఆగస్టు 1 నుంచి 10వ తేదీ వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి.