byసూర్య | Wed, Jul 06, 2022, 09:24 PM
తెలంగాణలో బుధవారం 563 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా 25,801 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో రాష్ట్రంలో 434 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఈరోజు కరోనా మరణాలు సంభవించలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,882 యాక్టివ్ కేసులు ఉన్నాయి. హైదరాబాద్లో 297, మేడ్చల్లో 46, రంగారెడ్డిలో 64, ఖమ్మంలో 15, భద్రాద్రిలో 15, సంగారెడ్డిలో 13, యాదాద్రి జిల్లాలో 11 కేసులు నమోదయ్యాయి.