శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ ఆశయాన్ని ప్రధాని నెరవేర్చారన్నారు: బండి

byసూర్య | Wed, Jul 06, 2022, 04:27 PM

జమ్మూకశ్మీర్‌ భారత్‌లో భాగమని ఆనాడే పోరాడిన వ్యక్తి డా. శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీలోని మైనారిటీ సంతుష్ఠీకరణ నచ్చకే ఆయన బయటకు వచ్చారని చెప్పారు. శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ జయంతి సందర్భంగా భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి బండి సంజయ్‌ సహా పలువురు నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంజయ్‌ మాట్లాడారు.

శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ జయంతి సందర్భంగా భాజపా ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఆయన ఆశయాలు సాధించడానికి ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని చెప్పారు. ఆర్టికల్‌ 370 రద్దు చేసి శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ ఆశయాన్ని ప్రధాని నెరవేర్చారన్నారు.


Latest News
 

150 కుటుంబాలు కాంగ్రెస్ లో చేరికలు Sat, Apr 20, 2024, 10:49 AM
ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలి Sat, Apr 20, 2024, 10:34 AM
కాంగ్రెస్ పార్టీలో చేరికలు Sat, Apr 20, 2024, 10:32 AM
గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM