వారికి టికెట్లహామీ ఇవ్వట్లేదు: రేవంత్ రెడ్డి
byసూర్య |
Wed, Jul 06, 2022, 04:04 PM
టీపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరికల నేపథ్యంలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి టిక్కెట్ల హామీ, పార్టీలో ఉన్న అంతర్గత కలహాలపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతలకు సాధారణ ఎన్నికల్లో టికెట్లు ఇస్తామని ఎలాంటి హామీ ఇవ్వడం లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ విధానానికి అనుగుణంగానే టికెట్ల కేటాయింపు జరుగుతుందని రేవంత్ రెడ్డి తెలిపారు.
Latest News