byసూర్య | Wed, Jul 06, 2022, 03:57 PM
హుజురాబాద్ నియోజకవర్గం, కమలాపూర్ మండలం&గ్రామానికి చెందిన కోయ్యడ అశోక్ దళితబంధు పథకం ద్వారా ఎంపిక చేసుకున్న అక్షయ కిరణ్ జనరల్ స్టోర్ ని తెరాస నాయకులూ గెల్లు శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించడం జరిగింది. భీంపల్లి గ్రామానికి చెందిన అంబాల నరేందర్ దళిత బంధు పథకం ద్వారా ఎంపిక చేసుకున్న లక్ష్మి వేంకటేశ్వర ఐరన్ & హార్డ్వేర్ షాప్ కమలాపూర్ మండలం కేంద్రం లో ఏర్పాటు చేసుకోగా వారి షాపు ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి నవీన్ కుమార్ , ఎంపిటిసి వేంకటేశ్వర్లు , భీంపల్లి సర్పంచ్ జవ్వాజి పద్మా-కుమార స్వామి , సింగిల్ విండో డైరెక్టర్ ఇంద్రాసేనా రెడ్డి , గ్రామ శాఖ అధ్యక్షులు మారపెల్లి ప్రభాకర్ , రైతు సమన్వయ అధ్యక్షులు కుమారస్వామి పాల్గొన్నారు.