byసూర్య | Wed, Jul 06, 2022, 03:26 PM
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు విజయవంతం అయ్యేందుకు కృషి చేసిన వారిలో సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గ బీజేపీ నేత సంగప్ప ను పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ బుధవారం హైదరాబాద్లో ఘనంగా సన్మానం చేశారు. మీడియా మరియు ఫోటో, వీడియో డిపార్ట్ మెంట్ ఇంఛార్జీగా వ్యవహరించిన రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ సంగప్ప ను బండి సంజయ్ ఈయనకు ప్రశంసించారు. ఈ సందర్భంగా సంగప్ప మాట్లాడుతూ ప్రధాని, శ్రీ అమిత్ షా లాంటి మహా మహులున్న సమావేశంలో మీడియా బాధ్యతలు చూడటం తన అదృష్టం అన్నారు. ఆ అవకాశం కల్పించిన రాష్ట్ర అధ్యక్షులకు సంగప్ప ధన్యవాదాలు తెలిపారు.