ఉరేసుకుని యువకుడు బలవన్మరణం
byసూర్య |
Wed, Jul 06, 2022, 02:11 PM
నారాయణపేట మండలం జాజపూర్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. భగవంత్ రెడ్డి (16) అనే యువకుడు గ్రామ శివారులో చెట్టుకు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇటీవలే తండ్రి కోట్ల వెంకట్ రెడ్డి తన కొడుకును హైద్రాబాద్ లోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదివేందుకు వదిలిపెట్టి రాగ, రెండు రోజుల క్రితం గ్రామానికి తిరిగివచ్చినట్లు గ్రామస్థులు తెలిపారు. అంతలోనే ఆత్మహత్యకు పునుకున్నాడు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. యువకుని మృతిని ఇటు కుటుంబ సభ్యులు, అటు స్నేహితులు జీర్ణించుకోలేక పోతున్నారు.
Latest News