byసూర్య | Tue, Jul 05, 2022, 11:37 AM
ఆషాడ మాస బోనాల పండగ నిర్వహణ కోసం హైదరాబాద్ నగరంలోని అమ్మవారి ఆలయ కమిటీలు ఆర్థిక సహాయం కోసం వెంటనే దరఖాస్తులు అందజేయాలని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బోనాలకు ముందే దేవాలయాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందించాలని నిర్ణయించిందని, అవసరమైన ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పరిధిలోనివే కాకుండా ప్రైవేట్ దేవాలయాలకు కూడా ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు.