byసూర్య | Tue, Jul 05, 2022, 11:17 AM
జగద్గిరిగుట్టలో దారుణం జరిగింది. సంపులో నెలన్నర వయసు గల పసిబిడ్డ మృతదేహం లభ్యమైంది. కాగా చిన్నారి మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరైనా చంపి సంపులో పడేశారా, లేదా చిన్నారి ప్రమాదవశాత్తు పడిపోయిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సాధారణంగా నెలన్నర వయసు పసిబిడ్డ ముందుకు వెళ్లలేని స్థితిలో ఉంటుంది కాబట్టి చిన్నారిని ఎవరో హత్య చేశారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కేసు నమోదైంది.