కొందరు మూర్ఖులు ప్రచారం చేశారు: యాదమ్మ

byసూర్య | Sun, Jul 03, 2022, 10:56 PM

వంట నిపుణురాలు  యాదమ్మ అంశం ఇపుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. ఇందుకు కారణం లేకపోలేదు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న నోవాటెల్, హెచ్ఐసీసీ ప్రాంగణంలోకి తనను రానివ్వలేదంటూ వచ్చిన వార్తలను తెలంగాణ వంటల నిపుణురాలు యాదమ్మ ఖండించారు. నోవాటెల్ వద్దకు వెళ్లినప్పుడు కొందరు తనను కింద కూర్చొమ్మని చెప్పి ఫొటోలు తీశారని, అప్పుడు వారి దురుద్దేశం ఏమిటో తనకు అర్థం కాలేదని ఆమె చెప్పారు. దీనిపై కొందరు మూర్ఖులు ప్రచారం చేశారని మండిపడ్డారు. ఈ మేరకు ఆమె మాట్లాడిన వీడియోను బీజేపీ తెలంగాణ విభాగం ట్విట్టర్ లో పోస్టు చేసింది.


ఇదిలావుంటే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే అతిథులకు తెలంగాణ వంటకాలను రుచి చూపించేందుకు రాష్ట్ర బీజేపీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఆ వంటలను సిద్ధం చేసేందుకు కరీంనగర్ కు చెందిన నిపుణురాలు యాదమ్మకు బాధ్యత అప్పగించింది. ఆదివారం మధ్యాహ్నం ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలంతా ఈ వంటలను రుచి చూశారు.


Latest News
 

రేపే ఆదివారం.. చికెన్, మటన్ షాపులు బంద్ Sat, Apr 20, 2024, 04:03 PM
జనం భారీగా చిలుకూరు ఎందుకు వెళుతున్నారు? Sat, Apr 20, 2024, 03:30 PM
కొండగట్టులో ఆర్జిత సేవలు రద్దు Sat, Apr 20, 2024, 03:22 PM
ఇంద్రవెల్లి నెత్తుటి మరకలకు 43 ఏళ్లు Sat, Apr 20, 2024, 03:21 PM
నత్త నడకన సాగుతున్న పోలోని వాగు వంతెన నిర్మాణం Sat, Apr 20, 2024, 02:43 PM