byసూర్య | Sun, Jul 03, 2022, 09:18 PM
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో బీజేపీ విజయ సంకల్ప సభ ముగిసింది. సమావేశం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ రాజ్భవన్కు చేరుకున్నారు. రాత్రికి రాజ్భవన్లో బస చేయనున్నారు. సోమవారం ఉదయం ఆయన ఏపీకి వెళ్లనున్నారు. భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణలో పాల్గొంటారు. మోదీ బస సందర్భంగా రాజ్భవన్ చుట్టూ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.