byసూర్య | Sun, Jul 03, 2022, 09:14 PM
తెలంగాణ కొత్తగా 457 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 494 మంది కరోనా నుంచి కోలుకున్నారు.ఈరోజు కరోనా మరణాలు సంభవించలేదు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,747 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 98.90 శాతం. ఆదివారం రాష్ట్రంలో 22,384 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 285, సంగారెడ్డి 35, రంగారెడ్డి 25, మేడ్చల్లో 27 కరోనా కేసులు నమోదయ్యాయి.