byసూర్య | Sun, Jul 03, 2022, 09:12 PM
రాజకీయాలు, ప్రజల సమస్యల కోసమే బీజేపీ నేతలు చార్మినార్ భాగ్యలక్ష్మి మందిరానికి వెళ్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. శనివారం సీఎల్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అమ్మవారి దర్శనానికి ఎవరైనా వెళితే ఇబ్బంది లేదని, రాజకీయ ప్రయోజనాల కోసం వెళ్లడం తగదని విమర్శించారు. గతంలో భాజపా భాగ్యలక్ష్మి గుడి పేరు చెప్పి ఓట్లు అడిగారన్నారు.