byసూర్య | Fri, Jul 01, 2022, 10:39 AM
నకిరేకల్ పట్టణానికి చెందిన విద్యార్థిని పెండ్యాల మహేశ్వరి కి ఇంటర్మీడియట్ వార్షిక ఫలితాలలో బైపీసీ ప్రధమ సంవత్సరంలో 436/440 స్టేట్ ర్యాంకు సాధించిన సందర్భంగా నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఘనంగా సన్మానించారు. అంతే కాకుండా 10 వేల రూపాయలు నగదు బహుమతిని కూడా ఇవ్వడం జరిగింది. ఉత్తమ ఫలితాలు సాధించిన నకిరేకల్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపక బృందాన్ని కూడా అభినందించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నకిరేకల్ విద్యార్థిని పదవ తరగతి పరీక్షా ఫలితాలలో 10/10 స్టేట్ ర్యాంకు రావడంతో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆమెను అభినందించి సన్మానించడమే కాకుండా, 10 వేల రూపాయలు నగదు బహుమతిని ఇవ్వడం జరిగింది.