byసూర్య | Fri, Jul 01, 2022, 10:38 AM
వృద్ధురాలు మెడలో నుంచి బంగారం చోరీ చేసిన సంఘటన చండూరు మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చందూరు మండలం బొంగిగూడెంలో గురువారం వట్టి లక్ష్మమ్మ తన కొడుకు రామస్వామి ఇంట్లో ఒంటరిగా ఉండడంతో అదును చూసి గుర్తు తెలియని వ్యక్తి వృద్ధురాలి మెడలో ఉన్న 4 తులాల బంగారు గొలుసు దొంగలించాడు. లక్ష్మమ్మ తన కొడుకు రామస్వామికి తెలపడంతో రామస్వామి లక్ష్మమ్మ ఇద్దరు కలిసి చండూరు మండలంలోని పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై నవీన్ గురువారం తెలిపారు.