byసూర్య | Fri, Jul 01, 2022, 10:36 AM
కేంద్ర సహాయమంత్రి కుమారి సాద్వి నిరంజన్ జ్యోతి మహేశ్వరంలోని శ్రీ రాజరాజేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. శివలింగానికి అభిషేకం చేసి వేదపండితుల ఆశీస్సులు తీసుకున్నారు సాద్వి నిరంజన్ జ్యోతి , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందెల శ్రీరాములు యాదవ్. అనంతరం డబిల్ గూడ, నాగిరెడ్డిపల్లిలో జరిగిన గ్రామసభల్లో పాల్గొన్నారు. ఢిల్లీ నుంచి పల్లె గల్లీలకు వచ్చే కేంద్ర నిధులను గ్రామస్తులకు వివరించారు. పల్లె ప్రజల మధ్య రాత్రి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.