byసూర్య | Fri, Jul 01, 2022, 10:35 AM
మాదాపుర్ హైటెక్ సిటీ సమీపంలో ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో దానిలో ప్రయాణిస్తున్న వారు ఆందోళనకు గురయ్యారు. కారు రన్నింగ్లో ఉన్న సమయంలోనే మంటలు చెలరేగడం గమనార్హం. దీంతో కారులో ప్రయాణిస్తున్న వారు అలర్ట్ అయి వెంటనే దిగిపోవడంతో ఎలాంటి ప్రాణనష్టమూ సంభవించలేదు. కారు ఘటన నేపథ్యంలో హైటెక్ సిటీ దారిలో ట్రాఫిక్ జామ్ అయ్యింది.