రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసింది : షర్మిల

byసూర్య | Fri, Jul 01, 2022, 10:14 AM

ప్రజా ప్రస్థానం పాదయాత్ర ద్వారా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ కు వ్యతిరేకంగా చాపకింద నీరులా పనిచేస్తూ పోతున్న వైయస్ షర్మిల ప్రజాక్షేత్రంలో ప్రజల మద్దతు కూడగట్టడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అనర్గళంగా మాట్లాడుతూ, ప్రజా సమస్యలను గుర్తు చేస్తూ, కేసీఆర్ సర్కార్ వైఫల్యాలను టార్గెట్ చేస్తున్న వైయస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్రకు గ్రామ గ్రామాన ప్రజల నుంచి విశేషమైన మద్దతు లభిస్తుంది.


తాజాగా సూర్యాపేట మండలంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ షర్మిల పలు గ్రామాలలో పర్యటిస్తూ ప్రజలతో నేరుగా మాట్లాడుతూ, వారిలో చైతన్యం తీసుకు వచ్చే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బిజెపిలు కెసిఆర్ కు అమ్ముడుపోయాయని వైయస్ షర్మిల ఆరోపించారు. టిఆర్ఎస్ పార్టీని ధీటుగా ఎదుర్కుంటూ పోరాటం చేస్తోంది వైయస్సార్ తెలంగాణ పార్టీ అని షర్మిల పేర్కొన్నారు. రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం, లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేశాయని వైయస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.


Latest News
 

చెరుకు శ్రీనివాస్ రెడ్డిని కలిసిన నీలం మధు ముదిరాజ్ Fri, Mar 29, 2024, 03:42 PM
బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా తాటికొండ రాజయ్య? Fri, Mar 29, 2024, 03:11 PM
సీఎం రేవంత్ ను కలిసిన కేకే Fri, Mar 29, 2024, 03:08 PM
నిప్పంటించుకుని యువకుని ఆత్మహత్య Fri, Mar 29, 2024, 02:56 PM
ప్రజల సౌకర్యార్థం బోరును తవ్వించినవి కాంగ్రెస్ నాయకులు Fri, Mar 29, 2024, 02:55 PM