byసూర్య | Fri, Jul 01, 2022, 08:52 AM
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని రాజీవ్ రహదారిపై రెండు లారీ ఢీకొన్న ప్రమాదంలో ఒక డ్రైవర్ కు గాయాలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ నుండి ఢిల్లీకి చాపల లోడుతో వెళ్తున్న ఎపి39టిఎ 9439లారీని రాంగ్ రూట్ లో వస్తున్న ఎపి04 టిఎక్స్ 1663లారీ శుక్రవారం ఎదురెదురుగా డీకొన్నాయి.
ఢిల్లీ వెళ్తున్న లారీ డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న ట్రాఫిక్ సిఐ ప్రవీణ్ కుమార్, పోలీసులు గాయాలైన డ్రైవర్ ను ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి తరలించారు.