byసూర్య | Thu, Jun 23, 2022, 08:34 PM
హైదరాబాద్ లోని ఛత్రినాక పరిధిలో ఓ 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. ఉప్పుగూడా ప్రాంతానికి చెందిన బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు. అలీ అనే యువకుడితో బాధిత బాలికకు పరిచయముంది. బాలికను ఇంటికి పిలిచిన అలీ తన ఫ్రెండ్ అర్బాస్తో కలిసి బాలికపై అత్యాచారం చేశాడు. బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.