byసూర్య | Thu, Jun 23, 2022, 08:06 PM
ఇంటర్ లో 100 శాతం సిలబస్ కు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ విద్యాసంవత్సరం నుంచి పాత విధానంలోనే ఇంటర్ పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా కారణంగా గత రెండేళ్లుగా 70 శాతం సిలిబస్ తోనే పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.