byసూర్య | Thu, Jun 23, 2022, 08:00 PM
హైదరాబాద్ లో పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ ను ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆసక్తి చూపుతోంది. ఈక్రమంలో దీనికి సంబంధించిన ప్రమాణాలు, లీగల్ అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ ను మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. దీనిని అసెంబ్లీ నుంచి ప్యారడైజ్ వరకూ 10 కి. మీల మేర నిర్మించనున్నట్లు తెలిపారు. దీంతోపాటు మురుగునీటి శుద్ధి ప్రణాళికల కోసం 2850 కోట్లు ఇవ్వాలని కోరారు.