లక్షల ఖర్చుచేసినా కవల పిల్లలు దక్కలేదు: యాజమాన్యం తీరుపై తల్లిదండ్రుల ఆగ్రహం

byసూర్య | Thu, Jun 23, 2022, 03:03 PM

లక్షల ఖర్చుచేస్తుంటే వైద్యులు మెరుగైన వైద్యం అందిస్తున్నారేమో అనుకొన్నారు ఆ తల్లిదండ్రలు. ఇలా ఏకంగా రూ.60 లక్షల వరకు ఖర్చుచేయగా ప్రాణలేని తమ పసిపిల్లలను తీసుకోవాల్సి వచ్చింది. ఇలా ప్రైవేట్ ఆస్పత్రుల ఆగడాలు శ్రుతి మించుతున్నాయి. వైద్యం పేరుతో రూ.లక్షలు వసూలు చేస్తూ రోగుల ప్రాణాలతో ఆటలాడుతున్నాయి. తాజాగా బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో ఇలాంటి దారుణమే జ‌రిగింది. ప్రసవం కోసం వెళ్లిన ఓ మహిళకు కవలలు జన్మించగా.. వారికి చికిత్స పేరుతో రూ.లక్షలు వసూలు చేశారు. అయినా కూడా ఆ కవలల ప్రాణాలు కాపాడలేకపోయారు.


వివరాల్లోకి వెళ్తే.. సిటీలోనే నివాసముంటున్న రఘునాథ్ రెడ్డి, సువర్ణ భార్య భ‌ర్తలు.. సువర్ణ నిండు గ‌ర్భణి కావడంతో ప్రసవం కోసం ఏప్రిల్ 24న రెయిన్ బో ప్రైవేట్ హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. ఈ క్రమంలోనే 12 రోజుల తర్వాత కవలలకు సువర్ణ జ‌న్మనిచ్చింది. అయితే పసికందుల ఆరోగ్యం బాగాలేదంటూ వారికి వైద్యం పేరుతో రూ.లక్షలు వసూలు చేశారు.. పిల్లల ప్రాణాల కంటే డ‌బ్బులు ముఖ్యమా అనుకొని సువ‌ర్ణ కుటుంబ స‌భ్యులు డబ్బులు కడుతూ వచ్చారు. ఈ క్రమంలోనే మొత్తం రూ.60 లక్షల దాకా కట్టారు. అయితే పుట్టిన మూడో రోజే ఒక శిశువు మృతి చెందగా.. చికిత్స పొందుతూ మరో చిన్నారి కన్నుమూసింది. దీంతో కుటుంబ స‌భ్యులు ఆస్పత్రి యాజ‌మాన్యాన్ని ప్రశ్నించ‌గా.. చివరివరకు ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించామని.. ఇంకా తామేమీ చేయ‌లేమంటూ చేతులెత్తేశారు.


వైద్యం పేరుతో ఇప్పటివరకు తమ వద్ద నుంచి రూ.60 లక్షల దాకా ఆస్పత్రిలో కట్టించుకున్నారని.. అయినా తమ పిల్లల ప్రాణాలు దక్కలేదని బాధిత తల్లిదండ్రులు ఆవేద‌న వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే సంతానాన్ని కోల్పోయామని.. ఆగ్రహం వ్యక్తం చేశారు. రెయిన్ బో ఆస్పత్రి యాజ‌మాన్యంపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


Latest News
 

నేడు బీబీపేటకు షబ్బీర్ అలీ రాక Sat, Apr 20, 2024, 01:06 PM
ఎన్నికల్లో బిజెపిని ఓడించాలి Sat, Apr 20, 2024, 01:04 PM
కాశీ పాదయాత్రకుడికి ఘన స్వాగతం పలికిన భక్తులు Sat, Apr 20, 2024, 12:52 PM
సంక్షేమ పథకాలే బిజెపిని గెలిపిస్తాయి Sat, Apr 20, 2024, 12:50 PM
గంజాయిని పట్టుకున్న ఎస్ఓటి పోలీసులు Sat, Apr 20, 2024, 12:34 PM