ప్రగతి భవన్ ముట్టడికి జిహెచ్ఎంసి కార్మికులు పిలుపు
byసూర్య |
Thu, Jun 23, 2022, 11:50 AM
ప్రగతి భవన్ ముట్టడికి జి హెచ్ ఎంసి కార్మికులు పిలుపునిచ్చారు. మధ్యాహ్నం ఒంటిగంటకు భారీ ర్యాలీకి కార్మికులు ప్లాన్ చేశారు. జీహెచ్ఎంసీలో పని చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని.. జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి ప్రగతి భవన్ వరకూ కార్మికులు ర్యాలీ చేయనున్నారు. ప్రగతి భవన్ ముందు చెత్తవేసి నిరసన తెలుపుతామని కార్మికులు చెబుతున్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Latest News