ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య: ఎమ్మెల్యే
byసూర్య |
Thu, Jun 23, 2022, 10:18 AM
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్న కారణంగా అడ్మిషన్లకు డిమాండ్ పెరిగిందని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. బడి బాటలో భాగంగా శంషాబాద్ కవ్వగూడ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో సరస్వతీ మాత చిత్రపటానికి పూజలు చేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం చిన్నారుల చేత సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. సర్కారు బడుల్లో ఆంగ్ల బోధనతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆసక్తి చూపు తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రమేష్, ఎంపీపీ జయమ్మ, జడ్పీటీసీ తన్వీరాజు, వైఎస్ ఎంపీపీ నీలం, తదితరులు పాల్గొన్నారు.
Latest News