మూసి ప్రాజెక్టు లోకి కొనసాగుతున్న వరద నీరు
byసూర్య |
Thu, Jun 23, 2022, 09:08 AM
కేతేపల్లి మండలం మూసి ప్రాజెక్టు లోకి హైదరాబాద్ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతం నుండి ఇన్ ప్లో కొనసాగుతుంది. మూసి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు (4. 46 టీఎంసీలు ) కాగా ప్రస్తుతం 644 అడుగులు (4. 20 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. సూర్యాపేట ప్రజల అవసరాల కోసం 40 క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన ప్రాజెక్టు అధికారి బద్రు నాయక్ బుధవారం తెలిపారు.
Latest News