తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు
byసూర్య |
Thu, Jun 23, 2022, 08:33 AM
తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయని ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 27, 754 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా. కొత్తగా 434 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా హైదరాబాద్ నగరంలో 292 కేసులు వెలుగుచూశాయి. కరోనా బాధితులు 129 మంది కోలుకోగా. మరణాలేవీ నమోదు కాలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో 2, 680 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి. సోషల్ డిస్టెన్స్ పాటించాలని ఆయన కోరారు.
Latest News