ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

byసూర్య | Thu, Jun 23, 2022, 08:32 AM

హైదరాబాద్ నగర శివార్లలోని ఘట్‌కేసర్‌ లో ఘోర రోడ్డు ప్రమాదం చేటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతుల్లో ఓ యువతి, ఇద్దరు యువకులు ఉన్నారు. ప్రముఖ వెబ్ సైట్ కథనం ప్రకారం....ఘట్‌కేసర్‌ పరిధిలోని అవుషాపూర్‌ వద్ద వరంగల్‌ జాతీయ రహదారిపై గురువారం ఉదయం గుర్తుతెలియని వాహనం బైకును ఢీకొట్టింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉన్నది.

Latest News
 

మహాజన్ సంపర్క్ అభియాన్ Tue, Apr 16, 2024, 02:04 PM
ఎల్లమ్మ తల్లికి గ్రామస్తుల ప్రత్యేక పూజలు Tue, Apr 16, 2024, 01:30 PM
నిరుపేద వధువుకు పుస్తె, మట్టెలు అందజేత Tue, Apr 16, 2024, 12:31 PM
ఎనుమాముల మార్కెట్ లో మిర్చి రేట్లు Tue, Apr 16, 2024, 12:27 PM
బాసర ఐఐఐటీలో విద్యార్థి ఆత్మహత్య Tue, Apr 16, 2024, 12:26 PM