తల్లి ప్రేమ లేక తనువు చాలించిన అన్నదమ్ములు
byసూర్య |
Thu, Jun 23, 2022, 07:31 AM
మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. అమ్మ ప్రేమ లేదని తమ చావుకు ఎవరు కారణం కాదంటూ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న యాదిరెడ్డి (34) మహిపాల్ రెడ్డి (29) అన్నతమ్ములు. వివరాల్లోకి వెళితే.. రాంపల్లి దాయరా గ్రామానికి చెందిన యాదిరెడ్డి అతని తమ్ముడు మహిపాల్ రెడ్డి లు గత 9 నెలల క్రితం యాదిరెడ్డి, మహిపాల్ రెడ్డి ల తల్లి ప్రమీల అనారోగ్యంతో మృతి చెందడంతో తట్టుకోలేని కొడుకులు చివరకు సూసైడ్ నోట్ రాసి యాదిరెడ్డి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు , తమ్ముడు మహిపాల్ రెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్య కు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమ్మిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
Latest News