రాష్ట్రంలోని ప్రతి పట్టణం అద్భుతంగా: కేటీఆర్

byసూర్య | Thu, Jun 23, 2022, 02:57 AM

రాష్ట్రంలోని ప్రతి పట్టణం అద్భుతంగా ఉందని ఐటీ, పురపాలక శాఖ మం కేటీఆర్‌ అన్నారు. కేటీఆర్‌ జహీరాబాద్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం జహీరాబాద్‌లోని బాగారెడ్డి స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. జహీరాబాద్ మున్సిపాలిటీ అయిన తర్వాత ఒకేసారి రూ.50 కోట్లు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని చెప్పుకొచ్చారు. ఇప్పటికే ఈ మున్సిపాలిటీలో చాలా సౌకర్యాలు కల్పించామని, మహిళల కోసం రూ.14.50 కోట్లతో వెజ్, నాన్ వెజ్ మార్కెట్ కడుతున్నామని అన్నారు. ఆగస్టు 15 వరకల్లా అందుబాటులోకి తెస్తామని చెప్పారు. జహీరాబాద్‌లో ఎటు చూసినా పచ్చదనమేనని, హరితహారం కోసం రూ.2.55 కోట్లు ఖర్చు చేశామన్నారు మంత్రి కేటీఆర్.. అంతేకాకుండా పట్టణ ప్రగతి కోసం 18.79 కోట్లు విడుదల చేశామని, మరో 50 కోట్లు మౌలిక వసతుల కోసం ఇచ్చామని తెలిపారు.


ఈ క్రమంలోనే కాంగ్రెస్‌పై మంత్రి ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీ మొన్న తెలంగాణకు వచ్చి కాంగ్రెస్స్ పార్టీకి ఒక్క చాన్స్ ఇవ్వాలని అడుగుతున్నాడని.. అసలు కాంగ్రెస్‌కు 50 ఏళ్లు అవకాశం ఇచ్చినా ఏం చేయలేదని ఎద్దేవా చేశారు. ఇప్పుడు అవకాశం ఇస్తే ఏం చేస్తారని ప్రశ్నించారు. గతంలో ఇక్కడ పనిచేసిన గీతారెడ్డికి మంత్రి పదవి వచ్చింది కానీ, ఈ ప్రాంత ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. 65 ఏళ్ళ నుంచి పలు పార్టీలు చేసిన గబ్బును, దరిద్రాన్ని ఇప్పుడిప్పుడే వదలగొడుతున్నామన్నారు. సాగు నీరు, తాగు నీరు, వైద్యం ఇలాంటి పనులు చేసుకుంటూ మనం పోతుంటే.. కొంతమంది కులాలు, మతాల మధ్య గొడవలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.


రాష్ట్రంలోని ప్రతి పట్టణం అద్భుతంగా ఉందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. రైతాంగానికి 24 గంటలు కరెంట్ ఇస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అని చెప్పుకొచ్చారు. పెన్షన్లు అప్పట్లో రూ.200 ఉండేది.. ఇప్పుడు రూ.2,016 చేశామన్నారు. రాష్ట్రంలో 40 లక్షల ముందికి పెన్షన్ ఇస్తున్నామని.. మరో నెల, రెండు నెలల్లో అర్హులైన అందరికీ పెన్షన్ ఇస్తామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం కల్యాణ లక్ష్మి 12 లక్షల మందికి ఇస్తోందన్న కేటీఆర్‌.. కేసీఆర్ కిట్ ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పులు పెరిగాయని అన్నారు. సింగూరు నీళ్లు తెచ్చి ఇక్కడి బీడు భూములన్నీ తడుపుతామన్నారు. లక్షల ఎకరాలకు నీళ్లిస్తామని మంత్రి పేర్కొన్నారు.


 


 


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM