byసూర్య | Wed, Jun 22, 2022, 09:16 PM
తెలంగాణలో ఈ సంవత్సరం వానాకాలం సీజన్లో 70 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. 15 లక్షల ఎకరాల్లో కంది సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, రైతులకు విత్తనాలు, రసాయన ఎరువులు అందుబాటులో ఉంచాలన్నారు. రైతులు విడి విత్తనాలను కొనుగోలు చేయవద్దని, అధీకృత డీలర్ల వద్ద కొనుగోలు చేయాలని తెలిపారు.