byసూర్య | Wed, Jun 22, 2022, 09:09 PM
తెలంగాణలో గత 24 గంటల్లో 27,754 మందికి కరోనా పరీక్షలు చేయగా అందులో 434 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. హైదరాబాద్ జిల్లాలో ఎక్కువగా 292 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 71, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 28 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 129 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్త మరణాలు ఏవీ నివేదించబడలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 7,97,138 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,90,347 మంది ఆరోగ్యంగా ఉన్నారు. మరో 2,680 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 4,111 మంది కరోనాతో మృతి చెందారు.