కేసీఆర్ కుటుంబ అవినీతిపై విచారణ జరిపించండి: సీబీఐ డైరెక్టర్ ను కోరిన కే.ఏ.పాల్

byసూర్య | Wed, Jun 22, 2022, 04:49 PM

ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై ఇటీవల విరుచుకుపడుతున్న ప్రజాశాంతి పార్టీ అధినేత, క్రైస్తవ మత బోధకుడు ఓ అడుగు ముందుకేశారు. కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడిందని సీబీఐ డైరెక్టర్ కు ఆయన ఫిర్యాదు చేశారు. టీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఆయ‌న కుటుంబ స‌భ్యులు భారీ ఎత్తున అవినీతికి పాల్ప‌డ్డార‌ని, ఈ వ్య‌వ‌హారంపై ద‌ర్యాప్తు చేప‌ట్టాల‌ని సీబీఐ డైరెక్ట‌ర్ సుభోద్ జైస్వాల్‌కు ప్ర‌జా శాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఫిర్యాదు చేశారు. ఈ మేర‌కు బుధ‌వారం ఢిల్లీలో సీబీఐ కార్యాల‌యానికి వెళ్లిన పాల్‌ సీబీఐ డైరెక్ట‌ర్‌తో అర గంట పాటు భేటీ అయ్యారు.


సీబీఐ డైరెర‌క్ట్‌తో భేటీ తర్వాత కార్యాల‌యం బ‌య‌ట‌కు వ‌చ్చిన కేఏ పాల్ అక్క‌డే మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ కుటుంబం ఏకంగా రూ.9 ల‌క్ష‌ల కోట్ల మేర అవినీతికి పాల్ప‌డింద‌ని ఆయ‌న ఆరోపించారు. ఈ వ్య‌వ‌హారానికి సంబంధించిన స‌మగ్ర ఆధారాల‌ను సీబీఐ డైరెక్ట‌ర్‌కు అంద‌జేశాన‌ని ఆయ‌న తెలిపారు. తాను అంద‌జేసిన ఆధారాల‌ను ప‌రిశీలిస్తామ‌ని, అవ‌స‌ర‌మ‌నుకుంటే త‌న‌ను సంప్ర‌దిస్తామ‌ని సీబీఐ డైరెక్ట‌ర్ చెప్పిన‌ట్టు పాల్ వెల్ల‌డించారు. 


Latest News
 

ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM
బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పని చేయాలి : అరుణతార Thu, Apr 25, 2024, 01:23 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM