లక్షల కోట్ల సొమ్ములు ఎటుపోతున్నాయో: రేవంత్ రెడ్డి

byసూర్య | Wed, Jun 22, 2022, 04:46 PM

వివిధ పన్నలు, ప్రజలపై భారాలు మోపడం ద్వారా వచ్చిన లక్షల కోట్ల సొమ్ములు ఎటుపోతున్నాయోనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ పై మరోసారి ధ్వజమెత్తారు. కేసీఆర్ దుష్టపాలనలో రాష్ట్ర ఖజానా దివాలా తీసిందని విమర్శించారు. అప్పుల ద్వారా, భూముల అమ్మకాల ద్వారా, చమురు ధరల పెంపుతో వ్యాట్ ద్వారా, విద్యుత్, భూముల రిజిస్ట్రేషన్ చార్జీలు, బస్సు చార్జీల పెంపు ద్వారా, మద్యం అమ్మకాల ద్వారా జనం ముక్కుపిండి వసూలు చేస్తున్న లక్షల కోట్ల సొమ్ములు ఎటుపోతున్నాయో? అంటూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. 


ఇకనైనా మీ రాజకీయ విన్యాసాలు ఆపి, చిరుద్యోగులైన హోంగార్డులు, మోడల్ స్కూల్స్ సిబ్బందికి వెంటనే మే నెల జీతాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే, ఆయా వర్గాలకు అండగా కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ ప్రకటిస్తుందని స్పష్టం చేశారు.


Latest News
 

ఈ నెల 18న హైదరాబాద్‌కు రానున్నాకేంద్రమంత్రులు, గోవా సీఎం Tue, Apr 16, 2024, 10:23 PM
సుర్రుమంటున్న సూరీడు.. రాష్ట్రానికి వడగాలుల ముప్పు, రెండ్రోజులు పెరగనున్న ఎండలు Tue, Apr 16, 2024, 08:25 PM
తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరానికి రూ. 10 వేలు, అకౌంట్లలోకి డబ్బులు Tue, Apr 16, 2024, 08:19 PM
హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ సమయాల్లో, ఆ రూట్లలో వెళ్తే ఇరుక్కుపోవటం పక్కా Tue, Apr 16, 2024, 08:12 PM
భద్రాద్రి రామయ్య కల్యాణోత్సవం.. భక్తులందరికీ ఉచిత దర్శనం Tue, Apr 16, 2024, 08:07 PM