byసూర్య | Wed, Jun 22, 2022, 11:48 AM
బంజారాహిల్స్ ఎన్బీటీనగర్లో నివసించే అశ్విని సోఫా విక్రయానికి ఓఎల్ఎక్స్ ప్రకటన ఇచ్చారు. ఓ అగంతకుడు కొనుగోలు చేస్తానని నమ్మించి ఆమె ఫోన్కు క్యూఆర్ కోడ్ పంపాడు. స్కాన్ చేస్తే డబ్బులు వస్తాయని చెప్పడంతో ఆమె అలాగే చేయడంతో ఖాతాలోని రూ. 22, 500లు విత్ డ్రా అయినట్లు సందేశం వచ్చింది. బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు చేస్తున్నారు.