తెలంగాణలో మరో 100 డయాలసిస్ సెంటర్లు
byసూర్య |
Wed, Jun 22, 2022, 10:58 AM
తెలంగాణ ప్రజలకు మంత్రి హరీష్ రావు గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా మరో 100 డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. మంథని పట్టణంలోని 50 పడకల మాతాశిశు సంక్షేమ కేంద్రాన్ని ప్రారంభించిన నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు సంక్షేమం కోసం ఉచిత డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
Latest News