byసూర్య | Wed, Jun 22, 2022, 07:54 AM
తెలంగాణలో మరోసారి కరోనా కేసులు పెరగడంతో రాష్ట్రంలో మళ్లీ ఆంక్షలు విధించారు. వైద్య ఆరోగ్య శాఖ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని జారీ చేసింది. అవేంటంటే..
10 ఏళ్లలోపు చిన్నారులు, 60 ఏళ్లకు పైబడిన వృద్ధులు తప్పనిసరి అయితేనే బయటికెళ్లాలి.
20 నుంచి 50 ఏళ్లలోపు వారు ఉద్యోగాలకు, ఉపాధికి, ఇతర ముఖ్యమైన పనులకు బయటికెళ్లేటప్పుడు అన్నిరకాల జాగ్రత్తలు తీసుకోవాలి.
ఇంటి నుంచి బయటికెళ్లే ప్రతిసారి మాస్కులు ధరించాలి.
మనిషికి మనిషికి మధ్య 6 అడుగుల కంటే ఎక్కువ భౌతిక దూరం పాటించాలి.
అవసరం లేకుండా ప్రయాణాలు చేయకూడదు. భౌతికదూరం తప్పనిసరిగా పాటించాలి.
వాక్సినేషన్ రెండు డోసులు తప్పకుండా తీసుకోవాలి.