విత్తనాలు మొలకెత్తలేదని రైతు బలవన్మరణం
byసూర్య |
Wed, Jun 22, 2022, 07:49 AM
అప్పులు చేసి వ్యవసాయం మొదలు పెట్టాడు ఓ రైతు. అయితే విత్తనాలు చల్లినా మొలకలు రాకపోవడంతో తీవ్ర మనో వేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడు. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం మార్గుడ గ్రామానికి చెందిన పడాల నాగన్న (56) మంగళవారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన పలువురికి కలిచి వేసింది. మృతుడి భార్య అరుణ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
Latest News