అఘాయిత్యాలు జరుగుతుంటే... కనీసం సమీక్ష చేయరా: రేవంత్ రెడ్డి
byసూర్య |
Wed, Jun 22, 2022, 07:31 AM
రాష్ట్రంలో ఆడబిడ్డలపై ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా. కనీసం సమీక్ష కూడా చేయకపోవడం దౌర్భాగ్యమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఆడపిల్లలపై జరిగిన దారుణాలను ప్రస్తావిస్తూ. రెండు వారాల్లో ఇన్ని అత్యాచారాలా? అని పేర్కొంటూ వార్తా కథనాలను తన ట్విటర్ ఖాతా ద్వారా షేర్ చేశారు. హైదరాబాద్ సహా రాష్ట్రం నలుమూలలా రోజూ ఎక్కడో చోట ఆడపిల్లలపై హత్యలు, అత్యాచారాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్ని దారుణాలు జరుగుతున్నాఫాంహౌస్ సీఎం, డమ్మీ హోం మంత్రి కనీసం సమీక్ష కూడా చేయకపోవడం రాష్ట్ర దౌర్భాగ్యమని ఆయన పేర్కొన్నారు.
Latest News