byసూర్య | Tue, Jun 21, 2022, 08:54 PM
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్కు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బండి సంజయ్కి 1 + 5తో రోప్ పార్టీ కూడా ఏర్పాటు చేశారు. పోలీసులు ఎస్కార్ట్ వాహనాన్ని కూడా ఏర్పాటు చేశారు. కరీంనగర్ లో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలతో ముప్పు పొంచి ఉందని ఇంటెలిజెన్స్ నివేదిక హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.