byసూర్య | Tue, Jun 21, 2022, 01:21 PM
కొడంగల్ నియోజకవర్గం మద్దూర్ మండల కేంద్రంలో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు మహిమూద్ పాఠశాల వదిలిన తర్వాత ద్విచక్ర వాహనంపై రోడ్డుపైకి వస్తుండగా, ఓ మెకానిక్ మరో ద్విచక్రవాహనంపై అతివేగంగా వచ్చి ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో ఉపాధ్యాయుడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రైవేటు వాహనంలో మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.