byసూర్య | Tue, Jun 21, 2022, 12:49 PM
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రానికి చెందిన బిజెపి సీనియర్ నాయకులు బురెడ్డి యాదిరెడ్డి సోమవారం పటాన్ చెరు ఎమ్మెల్యే సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా యాది రెడ్డిని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సాదరంగా టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. టిఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను చూసి పార్టీలో చేరుతున్నట్లు రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి ఒక్క టిఆర్ఎస్ తోనే సాధ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, మాజీ ఉప సర్పంచ్ భోజిరెడ్డి, ఉప సర్పంచ్ సంజీవ, వార్డు సభ్యులు శ్రీధర్ గౌడ్, నాయకులు నరేష్, యాదగిరి, ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.