కొరియర్ సేవలు కోసం వెతికితే.. రూ.70 వేలు హాంఫట్
byసూర్య |
Tue, Jun 21, 2022, 12:41 PM
బంజారాహిల్స్ రోడ్ నంబరు 12లో నివసించే రంజు అదిత్ భజోరియా ఆన్లైన్ కొరియర్ సర్వీసెస్ నిమిత్తం అంతర్జాలంలో అన్వేషించారు. ఓ వెబ్సైట్ను తెరిచి డబ్బులు చెల్లించేందుకు పేటీఎం ఓపెన్ చేయగానే ఆమె ఖాతాలోని రూ. 69, 999 విత్ డ్రా అయినట్లు సందేశం వచ్చింది. మోసపోయానని గ్రహించిన ఆమె బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Latest News