byసూర్య | Tue, Jun 21, 2022, 11:57 AM
నిజామాబాద్ నగరంలోని అర్సపల్లి ప్రాంతానికి చెందిన షేక్ జావిద్ (22) అనే యువకుడు అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు. నగరంలోని టైర్ రీట్రేడింగ్ షాపులో పనిచేస్తున్న జావిద్ ఈనెల 16న బోధన్లో బంధువులకు మూడు వేల రూపాయలు ఇచ్చి వస్తానని షాపు నుండి తీసుకెళ్లాడు. ఎంతకీ రాకపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో, బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో తండ్రి ముజిబ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.