byసూర్య | Tue, Jun 21, 2022, 11:41 AM
నగరంలోని కైతలాపూర్ ఫ్లైఓవర్ను మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రారంభించారు. కూకట్పల్లి నియోజకవర్గంలో కైతలాపూర్లో ఫ్లై ఓవర్ను రూ.86 కోట్ల వ్యయంతో జీహెచ్ఎంసీ నిర్మించింది. ఈ ఫ్లైఓవర్తో కూకట్పల్లి, హైటెక్ సిటీల మధ్య సాపీ ప్రయాణం సాధ్యం కానుంది. జేఎన్టీయూ జంక్షన్, మలేషియన్ టౌన్ షిప్ జంక్షన్, హైటెక్ సిటీ ఫ్లై ఓవర్, సైబర్ టవర్ జక్షన్ల వద్ద ట్రాఫిక్ చిక్కులు తగ్గనున్నాయి. సనత్నగర్, బాలానగర్ మీదుగా సికింద్రాబాద్ వరకు 3.50 కిలో మీటర్ల ప్రయాణ దూరభారం తగ్గనుంది.