భూగర్భడ్రైనేజీ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి : మ్మెల్యే కేపి వివేకానంద్

byసూర్య | Tue, Jun 21, 2022, 11:12 AM

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లి ఏఎస్ఆర్ బృందావన్ కాలనీకి చెందిన ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ కాలనీలో చేపడుతున్న భూగర్భడ్రైనేజీ నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎమ్మెల్యే గారికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. కాలనీ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు శ్రీధర్, సుబ్బరాజు, వెంకట్, రవికాంత్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


 


 


Latest News
 

సైబర్ నేరానికి మోసపోయిన యువకుడు Fri, Apr 19, 2024, 10:14 AM
బీఎస్పీకి కొత్త మనోహర్ రెడ్డి రాజీనామా Fri, Apr 19, 2024, 10:12 AM
పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి Thu, Apr 18, 2024, 11:10 PM
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు Thu, Apr 18, 2024, 10:25 PM
ఫస్ట్ అటెంప్ట్‌లోనే సివిల్స్ థర్డ్ ర్యాంక్.. సత్తా చాటిన తెలంగాణ యువతి Thu, Apr 18, 2024, 09:08 PM