byసూర్య | Tue, Jun 21, 2022, 10:54 AM
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ సి. ఐ గా విధులు నిర్వహిస్తున్న అశోక్ రెడ్డి ని బదిలీ చేస్తూ రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ కు నూతన సి. ఐ గా ఎల్బీనగర్ ఎస్ఓటీ సీఐగా విధులు నిర్వహిస్తున్న బి. అంజిరెడ్డిని నియమించారు. ఎల్బీనగర్ లో సుదీర్ఘ కాలం పాటు విధులు నిర్వహించిన అశోక్ రెడ్డి మల్కాజిగిరి ఎస్ఓటీ కి బదిలీ అయ్యారు.